డోపీలు జాగ్రత్త | the world anti-doping agency discovered new test | Sakshi
Sakshi News home page

డోపీలు జాగ్రత్త

Jan 18 2014 1:47 AM | Updated on May 25 2018 2:29 PM

క్రీడల్లో పెరిగిన డోపింగ్ జాఢ్యాన్ని అరికట్టేందుకు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా... ఏదో ఒక రూపంలో డ్రగ్స్ తీసుకుని దేశానికి మచ్చ తెచ్చే క్రీడాకారులు ఉంటున్నారు.

 కేశగ్రీవ పరీక్ష వచ్చింది
 క్రీడల్లో పెరిగిన డోపింగ్ జాఢ్యాన్ని అరికట్టేందుకు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా... ఏదో ఒక రూపంలో డ్రగ్స్ తీసుకుని దేశానికి మచ్చ తెచ్చే క్రీడాకారులు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో డోపింగ్‌ను పూర్తిగా అరికట్టే విధంగా ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ఓ అడుగు ముందుకు వేసింది. రకరకాల పరిశోధనల తర్వాత కేశగ్రీవ (హెయిర్ ఫొలికల్ టెస్టు-వెంట్రుకను స్రవించే పుటిక) పరీక్షను అమల్లోకి తేనుంది.

 ఈ టెస్టు ద్వారా  క్రీడాకారులు ఏ రూపంలో డ్రగ్స్ తీసుకున్నా ఇట్టే గుర్తించొచ్చని ‘వాడా’  కొత్త బాస్ క్రెయిగ్ రీడ్ చెబుతున్నారు. కొన్నిసార్లు శాంపిల్స్‌ను పరీక్షించినా కచ్చితమైన ఫలితాలు రాబట్టలేని సందర్భాల్లో ఈ టెస్టుతో నిజాన్ని నిగ్గు తేల్చొచ్చని పేర్కొన్నారు.

 సప్లిమెంట్లు, టాబ్లెట్లు, ఎనర్జీ డ్రింక్స్, రక్త మార్పిడి ఇలా ఎన్ని రకాలుగా డోపింగ్‌కు పాల్పడినా ఈ పరీక్షతో సులువుగా గుర్తించొచ్చు. ఈ కొత్త పరీక్ష కోసం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) 10 మిలియన్ అమెరికన్ డాలర్ల నిధిని కేటాయించింది. చాలా ఏళ్ల కిందటే ఈ పద్ధతిని ఫ్రాన్స్ ప్రోత్సహించినా... పాలకుల నిర్లక్ష్యం... అథ్లెట్ల వ్యతిరేకత వల్ల వెలుగులోకి రాలేకపోయింది.

ఇప్పటికైనా రీడ్ ఈ పద్ధతి అమలుకు ఒప్పుకోవడం చాలా సంతోషించిదగ్గ అంశం. ఓ రకంగా చెప్పాలంటే ఇటీవల డోపింగ్ పాజిటివ్స్‌గా తేలిన జమైకా స్టార్లు అథ్లెట్లు వెరోనికా క్యాంప్‌బెల్ బ్రౌన్, అసపా పావెల్, షెరోన్ సింప్సన్‌లకు ఇది పెద్ద దెబ్బే. ఈ కొత్త విధానాన్ని  స్ప్రింట్ కింగ్ ఉసేన్ బోల్ట్  స్వాగతించాడు. కొత్త పరీక్షతో తనకెలాంటి సమస్య లేదన్నాడు. మిగిలిన అథ్లెట్లు కూడా ఈ పరీక్షకు సిద్ధమవుతారా? లేక గతంలో మాదిరిగా వ్యతిరేకిస్తారో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement