'కేసీఆర్ కు బుద్ధి చెప్పాలి' | t.jeevan reddy fires on cm kcr | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ కు బుద్ధి చెప్పాలి'

Aug 9 2015 9:02 PM | Updated on Mar 18 2019 8:57 PM

'కేసీఆర్ కు బుద్ధి చెప్పాలి' - Sakshi

'కేసీఆర్ కు బుద్ధి చెప్పాలి'

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు వరంగల్ ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని సీఎల్‌పీ ఉపనేత టి. జీవన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

సంగెం: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు వరంగల్ ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని సీఎల్‌పీ ఉపనేత టి. జీవన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన వరంగల్ జిల్లా సంగెం మండలం మెండ్రాయిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాకముందు కేసీఆర్ తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని, దళితుణ్ని సీఎం చేస్తానని, రైతులకు రుణమాఫీ, డబుల్ బెడ్‌రూం ఇల్లు, మున్సిపాలిటీల్లో జీ ప్లస్‌ వన్ ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చి విస్మరించినట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం ఏ ముఖం పెట్టుకొని ఉప ఎన్నికల్లో ఓట్లు అడుగుతారని అన్నారు. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య చేసిన పాపం ఏమిటి?.. శ్రీహరి చేసిన పుణ్యం ఏమిటో స్పష్టం చేయాలన్నారు. కాంగ్రెసు పార్టీ హయాంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఒకేసారి రూ. 60 వేల కోట్ల రుణమాఫీ చేశారని గుర్తుచేశారు. అర్హులందరికీ ఇల్లు, పింఛన్లు మంజూరు చేసినట్లు జీవన్ రెడ్డి గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement