
ఆమె కీలకం..!
సార్వత్రిక ఎన్నికల్లో మహిళా ఓటర్లు ఓటింగ్ సరళి చర్చనీయాంశంగా మారింది. అన్ని నియోజకవర్గాల్లోనూ మహిళల ఓటింగ్ శాతం అధికంగా ఉండడం
విజయనగరం అర్బన్, న్యూస్లైన్: సార్వత్రిక ఎన్నికల్లో మహిళా ఓటర్లు ఓటింగ్ సరళి చర్చనీయాంశంగా మారింది. అన్ని నియోజకవర్గాల్లోనూ మహిళల ఓటింగ్ శాతం అధికంగా ఉండడం ప్రాధాన్యం సంతరించుకుం ది. దాదాపుగా అన్ని అసెంబ్లీ స్థానాల్లో మహిళల ఓట్లే కీలకంగా నిలిచాయి. పోలింగ్లో పెద్ద సంఖ్యలో పాల్గొ న్న వీరి తీర్పు కీలకం కానుంది. 2009 సార్వత్రిక ఎన్నిక ల తరహా పోకడలు ఈసారీ స్పష్టంగా కనిపించాయి. జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల పరిధిలో ఉన్న నాలుగు మున్సిపాలిటీలు, 26 మండలాల పరిధిలో 34,755 మహిళా సంఘాలున్నాయి. వీటిలో సుమారు 3,47,550 మంది సభ్యులుగా ఉన్నారు. వీరంతా ప్రతీ ఎన్నికల్లో గెలుపు ఓటములపై తమదైన ముద్రను వేస్తున్నారు. జిల్లాలోని చీపురుపల్లి, గజపతినగరం, కురుపాం, నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళల ఓటింగ్ శాతం అధికంగా ఉంది. జిల్లా మొత్తమ్మీద పురుషుల ఓటింగ్ 72.49 శాతం కాగా, మహిళల ఓటింగ్ 72.16 శాతంగా నమోదయింది.
నెల్లిమర్ల మహిళలు పోలింగ్లో ఫస్ట్
నెల్లిమర్ల నియోజకవర్గం మహిళలు భారీ సంఖ్యలో ఓటింగ్లో పాల్గొన్నారు. జి ల్లా పోలింగ్ శాతం కంటే అధికంగా ఓటు వేశారు. తొమ్మిది నియోజక వర్గాల లోని మొత్తం పోలింగ్ శాతం 79.57 నమోదు కాగా, దానిలో మహిళా ఓటర్ల శాతం 72.16. అయితే నెల్లిమర్ల నియోజ కవర్గంలో అత్యధికంగా 89.32 శాతం మహిళలు ఓటు వేశారు.