సీమాంధ్ర అసెంబ్లీలో అడుగుపెట్టను | Seemandhra made ​​her debut in the Assembly | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర అసెంబ్లీలో అడుగుపెట్టను

Apr 27 2014 2:58 AM | Updated on Aug 14 2018 4:51 PM

సీమాంధ్ర అసెంబ్లీలో అడుగుపెట్టను - Sakshi

సీమాంధ్ర అసెంబ్లీలో అడుగుపెట్టను

బొబ్బిలి, 175 మంది ఎమ్మెల్యేలుండే అసెంబ్లీలో తాను అడుగుపెట్టబోనని, అందుకే తాను పోటీ చేయడం లేదని జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

అందుకే పోటీ చేయడంలేదు: కిరణ్

  బొబ్బిలి,   175 మంది ఎమ్మెల్యేలుండే అసెంబ్లీలో తాను అడుగుపెట్టబోనని, అందుకే తాను పోటీ చేయడం లేదని జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రేపు అవసరమనుకుంటే ఎవరినో ఒకరిని రాజీనామా చేయించి ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడం పెద్ద సమస్యేమీ కాదన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో  శనివారం నిర్వహించిన ప్రచారసభలో ఆయన మాట్లాడారు. పదవి కోసం ఏగడ్డి అయినా తినే వ్యక్తిని తాను కాదన్నారు. విభజనపై సుప్రీంకోర్టులో తాను వేసిన కేసుకు సంబంధించిన వాదనలు మే 5న ఉన్నాయని చెప్పారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement