సార్వత్రిక రీ పోలింగ్ ప్రశాంతం | Re-Polling completed | Sakshi
Sakshi News home page

సార్వత్రిక రీ పోలింగ్ ప్రశాంతం

May 14 2014 3:11 AM | Updated on Sep 18 2019 2:56 PM

సార్వత్రిక రీ పోలింగ్ ప్రశాంతం - Sakshi

సార్వత్రిక రీ పోలింగ్ ప్రశాంతం

సార్వత్రిక ఎన్నికల రీ పోలింగ్ జిల్లాలో మంగళవారం ప్రశాంతంగా జరిగింది.

 మచిలీపట్నం, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల రీ పోలింగ్ జిల్లాలో మంగళవారం ప్రశాంతంగా జరిగింది. ఈవీఎంలలో సాంకేతిక లోపం ఏర్పడటంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 10 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్‌కు ఎన్నికల కమిషన్ ఆదేశించింది. రీ పోలింగ్ జరిగిన కేంద్రాల్లో మొత్తంగా 73.30 శాతం పోలింగ్ నమోదైనట్లు కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు తెలిపారు. ఈవీఎంలను కట్టుదిట్టమైన భద్రత మధ్య స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement