రాజంపేట లోక్‌సభకు కిరణ్ పోటీ! | Kiran kumar reddy will contest from Rajampet Lok sabha | Sakshi
Sakshi News home page

రాజంపేట లోక్‌సభకు కిరణ్ పోటీ!

Apr 10 2014 4:15 AM | Updated on Sep 2 2017 5:48 AM

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ‘జై సమైక్యాంధ్ర’ పార్టీ తరఫున రాజంపేట లోక్‌సభ స్థానానికి పోటీ చేయనున్నారని తెలుస్తోంది.

సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ‘జై సమైక్యాంధ్ర’ పార్టీ తరఫున రాజంపేట లోక్‌సభ స్థానానికి పోటీ చేయనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఒకటిరెండు రోజుల్లో పార్టీ ప్రెసిడెన్సియల్ బ్యూరోలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రస్తుతం చిత్తూరు జిల్లా పీలేరు శాసనసభా స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పీలేరులో వ్యతిరేక పవనాలు వీస్తుండడంతో కిరణ్ అక్కడినుంచి పోటీచేయడానికి వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement