ఈవీఎం మొరాయింపుపై ఈసీకి భన్వర్ లాల్ నివేదిక | bhanwar lal recommends election commission for evm non functioning | Sakshi
Sakshi News home page

ఈవీఎం మొరాయింపుపై ఈసీకి భన్వర్ లాల్ నివేదిక

May 17 2014 5:32 PM | Updated on Sep 2 2017 7:28 AM

ఈవీఎం మొరాయింపుపై ఈసీకి భన్వర్ లాల్ నివేదిక

ఈవీఎం మొరాయింపుపై ఈసీకి భన్వర్ లాల్ నివేదిక

జిల్లాలోని కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఫలితంపై మరికొన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంది.

మహబూబ్ నగర్: జిల్లాలోని కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఫలితం తేలడానికి మరికొన్ని రోజులు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. నిన్నటి నుంచి కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో జూపల్లి 119 బూత్ లోని ఈవీఎం మొరాయించడంతో ఆ ఫలితాన్ని అధికారులు పెండింగ్ లో పెట్టారు. ఇప్పటికే తీవ్రంగా శ్రమించిన అధికారులు తిరిగి ఆ ఈవీఎంను ఓపెన్ చేయడం కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని ఓపెన్ చేయడానికి ఈసీఎల్ ఇంజినీర్లు రంగంలోకి దిగినా.. చివరకు వారు చేతులెత్తేశారు. ఈవీఎంను ఓపెన్ చేయడం తమవల్ల కాదంటూ రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్ కు తేల్చిచెప్పేశారు. దీంతో ఇక్కడ తాజాగా ఎన్నిక నిర్వహించాలని భన్వర్ లాల్ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందజేశారు. ఈ బూత్ లో రీ పోలింగ్ నిర్వహించాలంటూ సిఫారుసు చేశారు.  మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఫలితంపై ఇంకా ఉత్కంఠ వీడలేదు.

 

కల్వకుర్తి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో దిగిన వంశీచంద్రెడ్డికి తన సమీప ప్రత్యర్థి అచారిపై167 ఓట్లు ఆధిక్యంగా పోలైయ్యాయి. ఆ దశలో ఈవీఎం మొరాయించింది. దాంతో ఎన్నికల అధికారులు కౌంటింగ్ నిలిపివేశారు. అనంతరం ఈవీఎం మొరాయించిందని ఎన్నికల అధికారులు ఈసీ ఫిర్యాదు చేశారు. ఈరోజు ఆ ఈవీఎంను ఓపెన్ చేయడం కష్టసాధ్యంగా మారడంతో తిరిగి ఈ బూత్ కు సంబంధించి ఎన్నిక అనివార్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇదిలా ఉండగా, కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో దివంగత వైఎస్సార్ సీపీ నేత భూమా శోభానాగిరెడ్డి విజయంపై కూడా ఈసీకి భన్వర్ లాల్ నివేదిక అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement