
నవ దంపతులకు వైఎస్ జగన్ ఆశీస్సులు
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తెను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీర్వదించారు.
గుంటూరు : గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తెను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీర్వదించారు. గురువారం హాయ్లాండ్లో జరిగిన ముస్తఫా కుమార్తె వివాహానికి ఆయన హాజరయ్యారు. నవ దంపతులను ఆశీస్సులు అందించారు. అంతకు ముందు హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం వచ్చిన వైఎస్ జగన్ అక్కడ నుంచి రోడ్డు మార్గంలో హాయ్లాండ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు తిరిగి హైదరాబాద్ బయల్దేరి వెళతారు.