అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి | Women death under mysterious circumstances | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

Sep 14 2016 12:42 AM | Updated on Mar 19 2019 6:59 PM

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి - Sakshi

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

అనుమసముద్రంపేట : అనుమానాస్పదస్థితిలో ఓ వివాహిత మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని అక్బరాబాద్‌లో ఆలస్యంగా మంగళవారం వెలుగుచూసింది.

 
– భర్తే చంపాడని మృతురాలి సోదరుడు ఫిర్యాదు 
 
అనుమసముద్రంపేట : అనుమానాస్పదస్థితిలో ఓ వివాహిత మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని అక్బరాబాద్‌లో ఆలస్యంగా మంగళవారం వెలుగుచూసింది. స్థానికుల సమాచారం మేరకు.. అక్బరాబాదుకు చెందిన కేతు లక్ష్మీకాంతమ్మ (35) ఆదివారం రాత్రి అనారోగ్యం వల్ల  మృతి చెందిందని ఆమె భర్త వేణుగోపాల్‌రెడ్డి బంధువులకు తెలిపారు. విషయం తెలుసుకుని వచ్చిన బంధువులు లక్ష్మీకాంతమ్మ మృతదేహాన్ని చూసి  విలపించారు. మృతదేహానికి సోమవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మృతురాలి సోదరుడు మల్లికార్జునరెడ్డి హైదరాబాద్‌ నుంచి రావాల్సి ఉండటంతో అంతవరకు ఆగాలని బంధువులు చెప్పారు. ఆయన వచ్చి సోదరి మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. తన సోదరిది సాధారణ మరణం కాదని, భర్త వేణుగోపాల్‌రెడ్డి చంపి ఉంటాడని  మల్లికార్జునరెడ్డి పోలీసులకు సోమవారం రాత్రి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది.  ఏఎసై వెంకటసాయి కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంగళవారం తరలించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement