కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ గృహిణి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.
గృహిణి ఆత్మహత్య
Dec 26 2016 7:27 PM | Updated on Nov 6 2018 7:53 PM
నల్లగొండ: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ గృహిణి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నకిరేకల్లో సోమవారం చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన మీలా సంధ్య(42) ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement