
2019 ఎన్నికల్లో పోటీ చేస్తాం: పవన్ కల్యాణ్
2019 నాటికి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వస్తానని జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ తెలిపారు.
విజయవాడ: 2019 నాటికి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వస్తానని జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని పవన్ తెలిపారు. కాగా ఈ భేటీలో జీహెచ్ఎంసీ ఎన్నికలపై చంద్రబాబుతో చర్చించలేదన్నారు. జనసేన పార్టీని విస్తరించేందుకు తన వద్ద డబ్బు లేదని పవన్ కల్యాణ్ అన్నారు. కాగా చంద్రబాబుతో పవన్ సుమారు రెండు గంటలపాటు సమావేశం అయిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు వెళ్లారు.