అంబేద్కర్‌ అశయాలను కొనసాగించాలి | we should continue Ambedkar's wishes | Sakshi
Sakshi News home page

అంబేద్కర్‌ అశయాలను కొనసాగించాలి

Apr 14 2017 4:23 PM | Updated on Aug 17 2018 8:11 PM

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అశయాలను కొనసాగించాలని ఎంపీడీవో మల్‌రెడ్డి, తహశీల్దార్‌ అంజనేయులు పేర్కొన్నారు

పెండ్లిమర్రి: పేద, బడుగు, బహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అశయాలను కొనసాగించాలని ఎంపీడీవో మల్‌రెడ్డి, తహశీల్దార్‌ అంజనేయులు పేర్కొన్నారు. అంబేడ్కర్‌ 126వ జయంతి వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణంలో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాలకు అంబేడ్కర్‌ ఎనలేని కృషి చేశారని కొనియాడారు.

అనంతరం మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు వెంకటన్న మాట్లాడుతూ అంబేడ్కర్‌ ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి చేయాలని ఆయన కోరారు.అలాగే పెండ్లిమర్రి వీరభద్రస్వామి దేవాళయంలో సమరసత సేవా పౌండేషన్‌ అధ్యక్షుడు రామలక్ష్మన్‌రెడ్డి ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. అంబేడ్కర్‌ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈకార్యక్రమంలో సర్పంచ్‌ రఘనాథ్‌రెడ్డి, ఏఎస్‌ఐ నాగన్న, వీఆర్వో ప్రసాద్, పంచాయితీ కార్యదర్శి బాస్కర్, బీజెపీ అసెంబ్లీ కన్వీనర్‌ బాలగురవయ్య, మండల మాల మహనాడు అధ్యక్షుడు రాజు, ఉపాధ్యాక్షుడు లారెన్స్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement