పంచాయతీ కార్యాలయాలపై విజిలెన్స్ దాడులు | Sakshi
Sakshi News home page

పంచాయతీ కార్యాలయాలపై విజిలెన్స్ దాడులు

Published Tue, Dec 1 2015 12:36 PM

Vigilance officials raids in godavari districts panchayat offices

కాకినాడ : ఉభయ గోదావరి జిల్లాల్లో విజిలెన్స్ అధికారులు మంగళవారం అకస్మిక దాడులు చేశారు. కాకినాడ రూరల్, అచ్చంపేట, పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు పంచాయతీ కార్యాలయాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయాల రికార్డులను అధికారులు తనిఖీ చేస్తున్నారు.

అలాగే రికార్డుల్లోని చోటు చేసుకున్న పలు పొంతన లేని అంశాలపై విజిలెన్స్ ఉన్నతాధికారులు పంచాయతి అధికారులను ప్రశ్నిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్ రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు సోమవారం దాడి చేశారు. ఈ సందర్భంగా సదరు అధికారి వద్ద రూ. 25 కోట్లకు పైగా ఆస్తి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement