పుట్టినరోజు వేడుకల్లో విషాదం | tragedy in birthday celebrations | Sakshi
Sakshi News home page

పుట్టినరోజు వేడుకల్లో విషాదం

Oct 24 2016 3:28 AM | Updated on Sep 4 2017 6:06 PM

పుట్టినరోజు వేడుకల్లో ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం

నీటిలో మునిగి ఇద్దరు విద్యార్థుల మృతి
సాక్షి, యాదాద్రి: పుట్టినరోజు వేడుకల్లో ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరులో ఆదివారం చోటుచేసుకుంది. భువనగిరిలోని ప్రెసిడెన్సీ పాఠశాలకు చెందిన 12 మంది విద్యార్థులు అదే పాఠశాలకు చెందిన విద్యార్థి రంజిత్ పుట్టినరోజు వేడుకలు చేసుకునేందుకు గూడూరుకు వెళ్లారు.

స్నేహితులంతా అక్కడి చిన్నేరువాగులో స్నానాలు చేశారు. వీరిలో 10వ తరగతి విద్యార్థులు సోమారపు సాయికిరణ్(15), మెడిగే నిఖిల్(17) పొలాల పక్కన ఉన్న గూడూరు గ్రామంలోకి కూల్‌డ్రింక్స్ తెస్తామని వెళ్లారు. వీరు తిరిగి వచ్చే సరికి స్నేహితులంతా స్నానాలు చేయడంతో వాగులో నీరు బురదగా మారాయి. దాంతో వీరిద్దరూ వాగుకు కొంచెం దూరంలోకి వెళ్లి స్నానం చేసేందుకు ప్రయత్నించగా నీటిలో మునిగిపోయారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement