గోదావరి నదిపై ఇచ్చంపల్లి వద్ద ఆనకట్ట నిర్మించాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్రెడ్డి, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి కోరారు. సోమవారం వారు న్యూ ఢిల్లీలో మంత్రి ఉమా భారతినికి కలిసి వినతి పత్రం అందజేశారు. ఇచ్చంపల్లి వద్ద అనకట్ట నిర్మిస్తే వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో 7 లక్షల ఎకరాలకు సాగు నీరు, తాగు నీరు అందుతుందని మంత్రికి వివరించారు.
ఇచ్చంపల్లి వద్ద ఆనకట్ట నిర్మించాలి
Sep 20 2016 12:38 AM | Updated on Sep 4 2017 2:08 PM
హన్మకొండ : గోదావరి నదిపై ఇచ్చంపల్లి వద్ద ఆనకట్ట నిర్మించాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్రెడ్డి, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి కోరారు. సోమవారం వారు న్యూ ఢిల్లీలో మంత్రి ఉమా భారతినికి కలిసి వినతి పత్రం అందజేశారు. ఇచ్చంపల్లి వద్ద అనకట్ట నిర్మిస్తే వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో 7 లక్షల ఎకరాలకు సాగు నీరు, తాగు నీరు అందుతుందని మంత్రికి వివరించారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో పార్టీ నాయకులు వెన్నంపల్లి పాపయ్య, మధు పాల్గొన్నారు.
Advertisement


