శివాలయంలో చోరీ | theft in shivalayam | Sakshi
Sakshi News home page

శివాలయంలో చోరీ

Aug 11 2016 11:52 PM | Updated on Sep 4 2017 8:52 AM

రాజుపాళెంలోని టీటీడీ కల్యాణ మండపం పక్కన ఉన్న ఈశ్వర రామాలయంలో బుధవారం రాత్రి దుండగులు చోరీ చేశారు.

రాజుపాళెం:  రాజుపాళెంలోని టీటీడీ కల్యాణ మండపం పక్కన ఉన్న ఈశ్వర రామాలయంలో బుధవారం రాత్రి దుండగులు చోరీ చేశారు. గురువారం తెల్లవారుజామున ఈ విషయాన్ని గ్రామస్తులు తెలపడంతో సంఘటన స్థలాన్ని ఏఎస్‌ఐ సుబ్బయ్య పరిశీలించారు. దేవాలయంలోని హుండీని పగులగొట్టి అందులోని నగదును అపహరించారు. ఈశ్వర ఆలయం, పార్వతీదేవి, సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి దేవాలయంలోని గర్భగుడి వాకిలికి వేసిన తాళాలను కూడా పగులగొట్టారు. శివలింగం ఉన్న గర్భగుడిలో బీరువాని పగులగొట్టి అందులో ఉన్న దేవాతామూర్తుల బట్టలను చిందరవందర చేశారు. హుండీలో ఉన్న రూ.5 వేలు వరకు నగదును తీసుకెళ్లారని గ్రామానికి చెందిన సానా వెంకటరమణారెడ్డి తెలిపారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ సుబ్బయ్య తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement