సింహాద్రిపురం పీఎస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
వైఎస్ఆర్ జిల్లా: సింహాద్రిపురం పీఎస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గండికోట ముంపువాసుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న వైఎస్ వివేకానందరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల వైఖరికి నిరసనగా సింహాద్రిపురం పీఎస్ వద్ద వైఎస్ వివేకానందరెడ్డి ధర్నా నిర్వహించారు.
అనంతరం ఇంటికి బయల్దేరిని ఆయనను గండికోట ముంపువాసుల వద్దకు వెళ్తున్నారంటూ తిరిగి పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.