breaking news
gandi kota victims
-
ముంపు గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన
సాక్షి, కడప: ముంపు గ్రామాల బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్రెడ్డి భరోసా ఇచ్చారు. శనివారం ఆయన వైఎస్సార్ జిల్లా గండికోట ముంపు గ్రామాల్లో పర్యటించారు. ఆందోళన నిర్వహిస్తున్న తాళ్ల పొద్దుటూరు గ్రామస్తులతో చర్చించారు. దీంతో ఇళ్లు ఖాళీ చేయడానికి గ్రామస్తులు ఒప్పుకున్నారు. ఈ సందర్భంగా సుధీర్రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే ప్రభుత్వం 900 కోట్లు పరిహారం చెల్లిందని తెలిపారు. గత ఏడాది కంటే ఎక్కువ టీఎంసీల నీరు నింపుకుంటే మేలు జరుగుతుందన్నారు. కలెక్టర్, జేసీల సమక్షంలో ముంపు వాసుల చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని సుధీర్రెడ్డి తెలిపారు. (చదవండి: అంతరాష్ట్ర బస్సులు: 14న కీలక భేటీ) -
సింహాద్రిపురం పీఎస్ వద్ద ఉద్రిక్తత
-
సింహాద్రిపురం పీఎస్ వద్ద ఉద్రిక్తత
వైఎస్ఆర్ జిల్లా: సింహాద్రిపురం పీఎస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గండికోట ముంపువాసుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న వైఎస్ వివేకానందరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల వైఖరికి నిరసనగా సింహాద్రిపురం పీఎస్ వద్ద వైఎస్ వివేకానందరెడ్డి ధర్నా నిర్వహించారు. అనంతరం ఇంటికి బయల్దేరిని ఆయనను గండికోట ముంపువాసుల వద్దకు వెళ్తున్నారంటూ తిరిగి పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.