అధికారుల పరుగులు! | teachers alert of tenth class exams | Sakshi
Sakshi News home page

అధికారుల పరుగులు!

Mar 21 2017 11:56 PM | Updated on Sep 5 2017 6:42 AM

పదో తరగతి పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకు అధికారులను పరుగులు పెట్టిస్తోంది. మడకశిర, కదిరి ఘటనల నేపథ్యంలో మంగళవారం జరిగిన ఇంగ్లిష్‌ పేపర్‌–1 పరీక్షకు విద్యాశాఖ గట్టి ఏర్పాట్లు చేసింది.

– పదో తరగతి పేపర్‌ లీక్‌ వ్యవహారంతో అప్రమత్తం
– ఇంగ్లిష్‌ పరీక్షకు గట్టి ఏర్పాట్లు

అనంతపురం ఎడ్యుకేషన్‌ : పదో తరగతి పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకు అధికారులను పరుగులు పెట్టిస్తోంది. మడకశిర, కదిరి ఘటనల నేపథ్యంలో మంగళవారం జరిగిన ఇంగ్లిష్‌ పేపర్‌–1 పరీక్షకు విద్యాశాఖ గట్టి ఏర్పాట్లు చేసింది. విద్యాశాఖ రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ప్రతాప్‌రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ, ప్రత్యేక బృందాలు జిల్లా వ్యాప్తంగా వివిధ కేంద్రాలను తనిఖీలు చేశాయి. ఎక్కడా ఎలాంటి సమస్యా తలెత్తకపోవడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. మొత్తం 49,131 మంది విద్యార్థులకు గాను 48,773 మంది హాజరయ్యారు. 358 మంది గైర్హాజరయ్యారు. 94 కేంద్రాలను అ«ధికారులు తనిఖీలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement