తెనాలి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వీరాభిమాని అయిన బొజ్జా తారకం తన జీవితకాలమంతా పీడితజన హక్కుల కోసం పోరాటం చేశారని కులనిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి దుడ్డు ప్రభాకర్ చెప్పారు. ప్రముఖ న్యాయవాది, దళిత, పీడిత ప్రజల హక్కుల కోసం కషి చేసిన బొజ్జా తారకం సంస్మరణ సభ గురువారం సాయంత్రం ఇక్కడి కవిరాజ పార్కులోని వీజీకే భవన్లో నిర్వహించారు. టి.శ్యాంషా అధ్యక్షత వహించారు. మానవహక్కుల వేదిక, మహాత్మాఫూలే, అంబేడ్కర్ విజ్ఞానసమితి, తెనాలి సంయుక్తంగా ఏర్పాటుచేసిన సభలో ప్రభాకర్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, పీడిత కులాల ప్రజల హక్కుల కోసం బయట సమాజంలో, న్యాయస్థానంలో పోరాడిన యోధుడు తారకం అన్నారు. దళిత మహాసభ వ్యవస్థాపకుల్లో ఒకరుగా దళితమహాసభ అధ్యక్షుడిగా దళితుల పక్షాన రాజీలేని పోరాటం చేసినట్టు గుర్తుచేశారు. సాంకేతిక విద్యాశాఖ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ బత్తుల పున్నయ్య మాట్లాడుతూ దళిత బహుజనులు ఏకమై అంబేడ్కర్ ఆయుధంగా రాజ్యాధికారానికి రావాలనీ, అదే తారకంకు ఇచ్చే నివాళిగా చెప్పారు. ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్, డివిజనల్ అధ్యక్షుడు దేవరపల్లి వీరయ్య తన ప్రసంగంలో చుండూరు కేసు న్యాయపోరాటంలో తారకం చేసిన కషిని వివరించారు. మానవ హక్కుల వేదిక జిల్లా కో–కన్వీనర్ అమర్తలూరి రత్నప్రసాద్, గురివిందపల్లి వేమయ్య, జీఎస్ నాగేశ్వరరావు ప్రసంగించారు.
రాజ్యాధికార సాధనే తారకంకు నివాళి
Published Thu, Sep 29 2016 10:57 PM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మూకుమ్మడిగా సెలవు పెట్టిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఉద్యోగులు
Yashika Aannand: అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న యాషిక ఆనంద్ (ఫొటోలు)
Paris Olympics 2024: భారత రెజ్లర్లకు ఆఖరి అవకాశం
65 ఏళ్లలో 7.8 శాతం తగ్గిన హిందూ జనాభా
కాసేపట్లో కర్నూలులో సీఎం జగన్ ప్రచారం
Mayawati: మేనత్త నిర్ణయంపై పెదవి విప్పిన ఆకాష్ ఆనంద్
ఎన్నికల ప్రచారంలో మంత్రి రోజాకు అపూర్వ స్వాగతం
జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
పచ్చ మద్యం స్వాధీనం..
SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
తప్పక చదవండి
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- SRH: వాళ్లిద్దరు పిచ్ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్కుమార్
- బాబు, పవన్, బాలయ్య, కిరణ్.. కూటమి ప్రముఖుల ఎదురీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement