విజయవాడ: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విజయవాడ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. అవినీతికి పాల్పడుతూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఓ తహశీల్దారుకు మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.60 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు.
తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలానికి తహశీల్దార్గా నాగేశ్వరరావు 2007 నవంబర్లో పని చేశారు. అదే మండలం వోడపాలెం గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు, రామారావు, పేరిరాజులకు తమ పూర్వీకుల నుంచి కొంత లంక భూములున్నాయి. కొందరు వ్యక్తులు ఆ భూమిని ఆక్రమించి సాగుచేయడానికి ప్రయత్నిస్తుండగా, బాధితులు అధికారులను సంప్రదించారు. అక్రమంగా సాగుచేసుకుంటున్న వారికే తహశీల్దార్ నాగేశ్వరరావు వత్తాసు పలికారు.
ఈ నేపథ్యంలో బాధితులు హైకోర్టును ఆశ్రయించగా, విచారణ జరిపి సమగ్ర నివేదిక పంపాలని కలెక్టర్ను హైకోర్టు ఆదేశించింది. కలెక్టర్ తహశీల్దారు నాగేశ్వరరావుకు ఆ బాధ్యతలు అప్పగించగా, విచారణలో ఫిర్యాదుదారులకు అనుకూలంగా నివేదిక ఇవ్వాలంటే రూ.20 వేలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో వారు రాజమండ్రి రేంజి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. నిందితుడు లంచం తీసుకుంటుండగా అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఈ తీర్పు చెప్పారు.
తహశీల్దార్కు మూడేళ్ల జైలు
Published Wed, Oct 28 2015 8:28 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆ..1,219 మంది ఉద్యోగులు మళ్లీ ఓటేయండి
నూతన పద్ధతిలో నగదు పంపిణీకి ప్రయత్నం
అధికారంలో ఉంటే అలా.. లేకుంటే ఇలా
దివ్యాంగుల సంక్షేమానికి వైఎస్సార్ సీపీ కట్టుబడి ఉంది
ఇంగ్లిష్ మీడియం తెచ్చిన ఒకే ఒక్క సీఎం జగన్
ఎంత కుట్ర పన్నారన్నా..!
టీడీపీ కార్యాలయం ఎదుట ధర్నా
No Headline
ఇంటి నుంచే ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్
రాష్ట్రంలో మళ్లీ ఫ్యాన్ ప్రభంజనమే
తప్పక చదవండి
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement