శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని ఫిజిక్స్ విభాగంలో బుధవారం నుంచి ఆదివారం వరకు ఇన్స్పైర్ సదస్సులు నిర్వహించనున్నారు.
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని ఫిజిక్స్ విభాగంలో బుధవారం నుంచి ఆదివారం వరకు ఇన్స్పైర్ సదస్సులు నిర్వహించనున్నారు. యువతలో శాస్త్రీయతను పెంచే ఉద్దేశంతో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సదస్సులు నిర్వహించేందుకు నిధులు మంజూరు చేసింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, మేథమేటిక్స్, సాంకేతిక రంగాల్లో నిష్ణాతులైన వారు సదస్సుల్లో ప్రసంగించనున్నారు.
92 శాతం ఆపైన పదో తరగతి ఉత్తీర్ణులై, ఇంటర్ విద్యార్థులు సదస్సుకు అర్హులుగా నిర్ణయించారు. కార్యక్రమానికి ఎస్కేయూ వీసీ ఆచార్య కె.రాజగోపాల్, అనంతపురం జిల్లా ఎస్పీ ఎస్వీ రాజశేఖర్ బాబు, ఆచార్య సి.చెన్నారెడ్డి(పెన్సిల్వేనియా వర్సిటీ, యూఎస్ఏ) ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.