సీఐ రాజశేఖర్రాజు
కోరుట్ల : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గ్యాంగ్స్టర్ నయీమ్ ఉదంతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం)లో కోరుట్ల సీఐ రాజశేఖర్రాజును సభ్యుడిగా నియమించారు. నయీమ్ దురాగతాలు, ఆకృత్యాలపై పూర్తిస్థాయిలో ఆరా తీయడానికి ఐజీ నాగిరెడ్డి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిట్ బృందంలో వరంగల్ రేంజ్ పరిధిలో రాజశేఖర్రాజు ఒక్కరే ఉండటం విశేషం.
-
నేర దర్యాప్తులో ప్రతిభ చూపుతున్న రాజశేఖర్రాజు
కోరుట్ల : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గ్యాంగ్స్టర్ నయీమ్ ఉదంతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం)లో కోరుట్ల సీఐ రాజశేఖర్రాజును సభ్యుడిగా నియమించారు. నయీమ్ దురాగతాలు, ఆకృత్యాలపై పూర్తిస్థాయిలో ఆరా తీయడానికి ఐజీ నాగిరెడ్డి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిట్ బృందంలో వరంగల్ రేంజ్ పరిధిలో రాజశేఖర్రాజు ఒక్కరే ఉండటం విశేషం. తాను పనిచేసిన పోలీస్స్టేషన్ల పరిధిలో వివిధ కేసుల దర్యాప్తులో ప్రతిభ చూపిన నేపథ్యంలో సిట్లో సభ్యుడిగా ఎంపిక చేసినట్లు సమాచారం. రాజశేఖర్రాజు 1996లో ఎస్సైగా ఎంపికయ్యారు. 1999లో వరంగల్ జిల్లా మంగపేట ఎస్సైగా పనిచేస్తున్న సమయంలో ఓ వ్యక్తి ఇన్సూరెన్సు పేరిట వేతనాలు ఇస్తామని రాష్ట్రవ్యాప్తంగా వేలాది మందిని ఏజంట్లుగా చేర్చుకుని రూ.14కోట్ల మోసగించాడు. ఈ కేసులో విచారణ జరిపి నిందితుడిని పట్టుకోవడం ఆ సమయంలో సంచలనం సృష్టించింది. 2000 సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లా వాంకిడిలో ఎస్సైగా పనిచేసిన సమయంలో ఐదేళ్ల క్రితం జరిగిన ఓ హత్యలో కేసులో ఖననం చేసిన మృతదేహాన్ని వెలికితీసి ఆ హత్య కేసులో ఏడుగురిని అరెస్టు చేయడం ఉన్నతాధికారుల దృష్టిని ఎంతగానో ఆకర్షించింది. 2011లో సీఐగా పదోన్నతి పొందిన రాజశేఖర్రాజు 2013లో వరంగల్ జిల్లా గూడురులో పనిచేస్తున్న సమయంలో ఓ ఉపాధ్యాయుడితో పాటు మరో వ్యక్తిని న్యూడెమోక్రసీ నక్సల్స్ పిస్టల్తో కాల్చిచంపితే దళంపై అనుమానం వస్తుందని కత్తులతో నరికి చంపారు. న్యూడెమోక్రసీ దళం అనుమానం రాకుండా ఈ హత్యలను చేసి ఉంటుందన్న సందేహంతో విచారణ సాగించిన రాజశేఖర్రాజు వారం రోజుల వ్యవధిలో దళం సభ్యులందరిని అరెస్టు చూపారు. కోరుట్ల సీఐగా పనిచేసిన ఆరునెలల కాలంలోనూ ఇళ్ల తాళాలు పగులకొట్టి లెక్కలేని దొంగతనాలు చేస్తున్న పార్థీ ముఠా సభ్యుడిని అరెస్టు చేశారు. ఈ ముఠా వెనుక మహారాష్ట్రలోని పోలీసు ఇన్స్పెక్టర్ పాత్ర ఉందని గుర్తించి ఆయన అరెస్టుకు ఉన్నతాధికారులను కోరారు. పదిరోజుల క్రితం బంగారం ఎరవేసి హైదరాబాద్తోపాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పలువురిని మోసగించి లక్షల్లో డబ్బులతో ఉడాయించిన ముఠా ఆటకట్టించారు. ఇలా పలు కేసుల దర్యాప్తులో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ ప్రతిభ చూపిన క్రమంలోనే నయీమ్ ఉదంతంలో ఏర్పాటు చేసిన సిట్లో సభ్యునిగా సీఐ రాజశేఖర్రాజు ఎంపికయినట్లు సమాచారం.