ఉత్తమ అవార్డులకు ఎంపిక | selected for best award | Sakshi
Sakshi News home page

ఉత్తమ అవార్డులకు ఎంపిక

May 1 2017 12:09 AM | Updated on Sep 5 2017 10:04 AM

కార్మిక శాఖ ఆధ్వర్యంలో మేడే సందర్బంగా ఇచ్చే అవార్డులకు జిల్లా నుంచి ముగ్గురిని ఎంపిక చేసినట్లు డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ యూ.మహేశ్వరకుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

కర్నూలు (రాజ్‌విహార్‌): కార్మిక శాఖ ఆధ్వర్యంలో మేడే సందర్బంగా ఇచ్చే అవార్డులకు జిల్లా నుంచి ముగ్గురిని ఎంపిక చేసినట్లు డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ యూ.మహేశ్వరకుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అదులో ఓం సాయి ప్రొఫెషనల్స్‌ డిటెక్టివ్, సెక్యూరిటీ సర్వీసెస్‌ యజమాని పిల్లి కనకారావు, గ్రీన్‌కో ఎనర్జీ (గని) ప్రతినిధి అనిల్‌కుమార్‌లకు ఉత్తమ యజమానులుగా, టీఎన్‌టీయూసీ జిల్లా అ«ధ్యక్షుడు అశోక్‌కుమార్‌ను శ్రమశక్తి అవార్డు కింద ఎంపిక చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వీరికి మేడే రోజున విజయవాడలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డులు అందజేస్తారని తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement