చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రభుత్వాలు ఆదుకోవాలని ఆలిండియా ఫోరమ్ ఫర్ స్మాల్, మీడియం ఇండస్ట్రీస్ రాష్ట్ర కన్వీనర్ కోటేశ్వర్రావు కోరారు.
చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవాలి
Sep 6 2016 11:54 PM | Updated on Sep 4 2017 12:26 PM
ముకరంపుర : చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రభుత్వాలు ఆదుకోవాలని ఆలిండియా ఫోరమ్ ఫర్ స్మాల్, మీడియం ఇండస్ట్రీస్ రాష్ట్ర కన్వీనర్ కోటేశ్వర్రావు కోరారు. మంగళవారం కరీంనగర్లోని ప్రెస్భవన్లో విలేకరులతో మాట్లాడారు. కరువు పరిస్థితులు, వ్యాపారం, ముడిసరుకు లేక పరిశ్రమల కోలుకోలేకపోతున్నాయన్నారు. ఈపరిస్థితుల్లో బ్యాంకులకు వడ్డీలు, వాయిదాలు కట్టలేకపోతున్నామని పేర్కొన్నారు. అప్పులు చెల్లించలేక పరిశ్రమలు మూతపడుతున్నాయని, బ్యాంకు రుణాలు ప్రభుత్వం మాఫీ చేయాలని కోరారు. రాష్ట్ర కన్వీనర్లు ప్రభాకర్రావు, రాజేశ్వర స్వామి, కళ్యాణ్ చక్రవర్తి, ఎం.వాసుదేవచారి, జడల భాస్కర్రావు, రవీందర్, మేరుగు పర్శరాములు, తాటికొండ రాజు, దేవదాసు, గుడ్లపల్లి సుధాకర్, శ్యాంసుందర్, వీరేశం, శనిగరం సునీత, మధు పాల్గొన్నారు.
Advertisement
Advertisement