కేంద్ర ప్రభుత్వ విధానాలు వ్యతిరేకిస్తూ, ప్రజాసామ్య పరిరక్షణ కోసం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఈ నెల 9న ధర్నా, 10న సుప్రీం కోర్టు ఎదుటనున్న ఇండియన్ సొసైటీ ఆఫ్ ఇంటర్నేషనల్ లా ఆడిటోరియంలో సదస్సు నిర్వహించనున్నారు.
10న ప్రజాస్వామ్య పరిరక్షణ సదస్సు
Sep 7 2016 12:24 AM | Updated on Sep 4 2017 12:26 PM
న్యూశాయంపేట : కేంద్ర ప్రభుత్వ విధానాలు వ్యతిరేకిస్తూ, ప్రజాసామ్య పరిరక్షణ కోసం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఈ నెల 9న ధర్నా, 10న సుప్రీం కోర్టు ఎదుటనున్న ఇండియన్ సొసైటీ ఆఫ్ ఇంటర్నేషనల్ లా ఆడిటోరియంలో సదస్సు నిర్వహించనున్నారు. ఈమేరకు పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు అనంతుల సురేష్, ప్రధాన కార్యదర్శి పెంట రమేష్ మంగళవారం సంయుక్త ప్రకటనలో తెలిపారు. దేశంలోని 19 రాష్ట్రాల ప్రజాహక్కుల సంఘాలు కలిసి ప్రజాస్వామిక హక్కుల సమన్వయ సంస్థ ఐక్యవేదికగా ఏర్పడి ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Advertisement
Advertisement