
ఈ ఏడాది 100
పట్టాభూముల్లో ఇసుక తవ్వకాలకు తెరవేసిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) పర్యవేక్షణలో సాగిస్తోంది.
♦ ఆరు క్వారీల నుంచి ఇసుక రవాణా
♦ సీసీ కెమెరాలతో పర్యవేక్షణ
♦ భవన నిర్మాణ పన్ను ఎగవేస్తే చర్యలు
♦ ‘సాక్షి’తో మైనింగ్ ఏడీ ఎస్ సురేందర్
మైనింగ్ శాఖ ఆదాయం 24 ఏళ్లలో తొలి రికార్డు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : పట్టాభూముల్లో ఇసుక తవ్వకాలకు తెరవేసిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) పర్యవేక్షణలో సాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఎనిమిది క్వారీలకు అనుమతి వచ్చినా ఆరు చోట్లనే తవ్వకాలు సాగిస్తున్నారు. మైనింగ్శాఖ ఆదాయం 24 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా నూరు శాతం వసూలు చేయడం... భవన నిర్మాణదారుల నుంచి పన్నుల వసూలుకు మైనింగ్ శాఖ స్పెషల్డ్రైవ్ చేస్తోంది. ఈ సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఇసుక తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడితే అసలుకే ఎసరు అంటున్న మైనింగ్శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ సింగం సురేందర్ వెల్లడించిన విషమాలు ఆయన మాటల్లోనే....
ఆరుచోట్ల...
జనవరి 12న జిల్లా వ్యాప్తంగా 10 ప్రాంతాల్లో పట్టాభూముల్లో ఇసుక తవ్వకాలకు డీఎల్ఎస్సీ అనుమతి ఇచ్చింది. ఆందులో ఎనిమిది అగ్రిమెంట్ కుదుర్చుకోగా.. ప్రస్తుతం ఆరు చోట్లనే తవ్వకాలు సాగుతున్నాయి. బిచ్కుంద మండలం వాజిద్నగర్, పుల్కల్, గుండెనెమ్లిలలో మొత్తం ఆరు క్వారీలు నడుస్తున్నాయి. కోటగిరి మండలం కారెగాంలో తహసీల్దారు నివేదిక అనంతరం తవ్వకాలకు అనుమతించనున్నారు.
టీఎస్ఎండీసీ పర్యవేక్షణలో...
మీ-సేవ కేంద్రాలలో అన్లైన్ ద్వారా డబ్బులు చెల్లించిన వారు ఆ రశీదులతో వస్తే నేరుగా ఇసుక తీసుకెళ్లే విధంగా రవాణా జరుగుతోంది. ప్రతి ఇసుక క్వారీ వద్ద సీసీ కెమెరాలు, టీఎస్ఎండీసీ పర్యవేక్షణలో నిబంధనల ప్రకా రం ఇసుక మేటల తొలగింపు ప్రక్రియ సాగుతుంది. ఇసుక నింపడం, రవాణా తదితర అంశాలను రెవెన్యూ, పోలీసు అధికారులు పర్యవేక్షిస్తారు. ఈ ఆరు క్వారీల నుంచి 10 వేల క్యూబిక్ మీటర్ల నుంచి 40 వేల క్యూబిక్ మీటర్ల మేరకు అనుమతులు ఉన్నాయి. 1.50 మీటర్లమ లోతు వరకే తవ్వే అవకాశ ఉంది.
నెలాఖరు లోపు..
1992లో ఈ జిల్లాలో మైనింగ్శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ కార్యాలయం ఏర్పడింది. 24 ఏళ్లలో మొదటిసారిగా పన్ను ల రూపేణా ఆదాయం సేకరణలో రికార్డు సాధించబోతున్నాము. ఈ ఏడాది రూ.25.67 కోట్లు పన్నుల రూపేణా వసూలు లక్ష్యం కాగా గురువారం నాటికి రూ.23.65 కోట్లు వచ్చింది. ఈ నెలాఖరులోపు నూటికి నూరు శాతం ఆదాయం వస్తుంది. 24 ఏళ్లలో లక్ష్యాన్ని సాధించడంలో తొలి రికార్డు కాబోతుంది.
పన్నులు ఎగవేస్తే చర్యలు..
పదివేల చదరపు అడుగులకు పైగా నిర్మించిన భవనాలపై పన్నులు ఎగవేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాము. ఇప్పటికే జిల్లాలో సుమారు 25 మందికిపైగా నోటీసులు ఇచ్చాము. ఈ నెలాఖరులోగా చెల్లించకపోతే చర్యలుంటాయి. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోఎమ్మెస్ నంబర్ 8 ప్రకారం 10,000 చదరపు అడుగులకు పైబడి నిర్మించిన భవనాలపై చదరపు ఒక్కంటికి రూ.3 చొప్పున పర్యావరణ ప్రభావ రుసుమును సంబంధిత గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, నగర పాలకసంస్థలకు చెల్లించాల్సి ఉంది. ఈ ఉత్తర్వులు నిర్మాణం జరుగుతున్న భవనాలు, వెంచర్లు, ఇటీవల పూర్తి కాబడిన భవనాలకు కూడ వర్తిస్తుంది.
అసలుకే ఎసరు..
ఇసుక తవ్వకాల విషయంలో కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా కమిటీ సీరియస్గా ఉంది. ఇసుక త వ్వకాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే అసలుకే ఎసరు వ స్తుంది. పట్టాభూముల్లో ఇసుక మేటల తొలగింపు పేరిట అనుమతులు ఇవ్వడంతో పాటు ఏ పరిణామంలో, ఎంత లోతులో తీయాలనేది డీఎల్ఎస్సీ అనుమతుల సందర్భం గా స్పష్టం చేస్తున్నది. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని ఇసుక తవ్వకాలు, తరలింపులు ఉండాలి. మై నింగ్ నిబంధనలను ఉల్లంఘిస్తే అనుమతుల రద్దుతో పాటు శాఖాపరమైన చర్యలు కూడా ఉంటాయి.