ఆర్టీసీ బస్సు-బైక్ ఢీ : ఇద్దరి మృతి | RTC bus, bike collided in vizag two died | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు-బైక్ ఢీ : ఇద్దరి మృతి

Aug 14 2016 8:33 AM | Updated on Aug 25 2018 6:06 PM

ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు.

విశాఖపట్నం : ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ సంఘటన విశాఖ జిల్లా మారికివలసలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.

వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో.. ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement