కలసపాడు ఎస్‌బీఐలో రూ.4.30 లక్షలు చోరీ | Rs 4.30 lakhs robbered in Kalasapdu SBI | Sakshi
Sakshi News home page

కలసపాడు ఎస్‌బీఐలో రూ.4.30 లక్షలు చోరీ

Mar 19 2016 12:05 PM | Updated on Sep 3 2017 8:08 PM

వైఎస్సార్ జిల్లా కలసపాడులోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డబ్బులు జమచేసేందుకు వెళ్లిన ఒక వ్యక్తి నుంచి రూ.4.30 లక్షలు అపహరించిన సంఘటన శనివారం ఉదయం జరిగింది.

కలసపాడు(వైఎస్సార్ జిల్లా): వైఎస్సార్ జిల్లా కలసపాడులోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డబ్బులు జమచేసేందుకు వెళ్లిన ఒక వ్యక్తి నుంచి రూ.4.30 లక్షలు అపహరించిన సంఘటన శనివారం ఉదయం జరిగింది. కలసపాడు ఎంపీపీ రామకృష్ణారెడ్డి కుమారుడు తిరుపతిరెడ్డి(బాబు) బంగారు నగలపై తీసుకున్న రుణం చెల్లించేందుకు రూ.4.30 లక్షలు తీసుకె ళ్లాడు.

నగదు ఉంచిన బ్యాగు పక్కన పెట్టుకుని పేయీ స్లిప్ రాస్తుండగా పక్కనే ఉన్న ముగ్గురు వ్యక్తులు నగదు సంచిని తీసుకుని ఉడాయించారు. ఈ విషయమై తిరుపతిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement