కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కరువు
ఒకే నంబరుపై రెండు, మూడు హాల్టికెట్లు జారీ
నామినల్ రోల్లో 99 మంది నంబర్లు గల్లంతు
అనంతపురం అర్బన్ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకు ఆదివారం నిర్వహించిన పరీక్ష గందరగోళంగా మారింది. కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో అసౌకర్యాల మధ్యే అభ్యర్థులు పరీక్ష రాయాల్సి. మరోవైపు అధికారుల తప్పిదం వల్ల 99 మంది అభ్యర్థుల నంబర్లు నామినల్ రోల్స్లో గల్లంతయ్యాయి. ఒకే నంబరుపై రెండు, నాలుగు హాల్టికెట్లు వచ్చాయి. నామినల్ రోల్స్లో నంబర్లు లేనివారు ఆందోళనకు గురయ్యారు.
దీంతో స్థానిక అధికారులు ఏపీపీఎస్సీ అధికారుల ఆదేశాలతో మాట్లాడి నామినల్ రోల్లో నంబర్లు లేని అభ్యర్థులకు వేరుగా పరీక్ష రాయించారు. 12 కేంద్రాల్లో జరిగిన ఏఈఈ రాతపరీక్షకు 4,086 మంది అభ్యర్థులకు గానూ 3,083 మంది హాజరయ్యారు. అనంతపురంలోని చైతన్య జూనియర్ కళాశాలలో పరీక్ష రాసేందుకు అభ్యర్థులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. బెంచీలు లేకపోవడంతో అట్టను ఒడిలో పెట్టుకుని పరీక్ష రాశారు. కొందరు కుర్చి, స్టూల్పై ఉంచుకుని పరీక్ష రాశారు. పరీక్ష రాసేందుకు అనువైన వాతావరణ కల్పించకపోవడంపై అధికారులతో అభ్యర్థులు వాగ్వాదానికి దిగారు. పరీక్ష కేంద్రాలను జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, డీఆర్ఓ మల్లీశ్వరిదేవి సందర్శించారు.
ఒకే నంబరుపై హాల్టికెట్లు
ఒకే నంబరుపై ఇద్దరు నుంచి నలుగురు అభ్యర్థులకు హాల్టికెట్లు జారీ అయ్యాయి. 612100312 నంబరుపై ఇద్దరికి, 6122011625 నంబరుపైన నలుగురికి హాల్టికెట్లు వచ్చాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఒకే హాల్ టికెట్ నంబర్ మరోకరిరావడంతో 99 మంది పేర్లు నామినల్ రోల్స్లో పేర్లు గల్లంతయ్యాయి. ఈ సందర్భంగా డీఆర్ఓ మల్లీశ్వరి దేవి మాట్లాడుతూ, ఏపీపీఎస్సీ సూచన మేరకు 99 మంది ఓఎంఆర్ షీట్లను, అభ్యర్థుల వివరాలను ప్రత్యేకంగా ఒక కవర్లో సీల్ చేసి పంపిస్తున్నామని తెలిపారు.
ఏపీపీఎస్సీ పరీక్ష గందరగోళం
Published Sun, Nov 6 2016 11:59 PM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
వైట్హౌస్కు ఏఐ టెక్నాలజీని పరిచయం చేసిన భారత సంతతి ఇంజనీర్! ఎవరీమె?
రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి
టీడీపీ కార్యకర్తల దాడి అంబటి స్ట్రాంగ్ కౌంటర్
పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు
పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్
తప్పక చదవండి
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement