తప్పిన ముప్పు | out of danger | Sakshi
Sakshi News home page

తప్పిన ముప్పు

Oct 25 2016 11:56 PM | Updated on Sep 4 2017 6:17 PM

తప్పిన ముప్పు

తప్పిన ముప్పు

ఉంగుటూరు : జాతీయ రహదారిపై బాదంపూడి వై.జంక్షన్‌ వద్ద మంగళవారం రాత్రి ఆర్టీసీ బస్సు, వ్యాన్‌ ఢీకొన్నాయి. ఇద్దరికిS స్వల్పగాయాలయ్యాయి. ప్రాణాపాయం తప్పింది.

ఉంగుటూరు : జాతీయ రహదారిపై బాదంపూడి వై.జంక్షన్‌ వద్ద మంగళవారం రాత్రి ఆర్టీసీ బస్సు, వ్యాన్‌ ఢీకొన్నాయి. ఇద్దరికిS స్వల్పగాయాలయ్యాయి. ప్రాణాపాయం తప్పింది. తాడేపల్లిగూడెం డిపోకు చెందిన బస్సు ద్వారకాతిరుమల నుంచి తాడేపల్లిగూడెం వస్తుండగా  వై.జంక్షన్‌ వద్ద విశాఖపట్నం నుంచి నెల్లూరు వెళ్తున్న వ్యా¯Œæను ఢీకొంది. ఆర్టీసీ బస్సులో ఉన్న 8 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. వ్యాన్‌ డ్రైవర్‌ అపోజు, మరో ప్రయాణికుడు గౌతం మరళీ గాయపడ్డారు. వీరిలో గౌతంను 108లో తాడేపల్లిగూడెం తరలించారు.  ఘటనాస్థలానికిS తాడేపల్లిగూడెం ఆర్టీసీ మేనేజర్‌ కుమార్‌ వచ్చి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. వ్యాన్‌ ముందుభాగం నుజ్జునుజ్జయింది. బస్సు ఢీకొన్న వ్యాన్‌ ముందుకు దూసుకుపోవడంతో బస్సు వెనుక భాగం దెబ్బతింది.  దీంతో ట్రాఫిక్‌ స్తంభించింది. ప్రయాణికులను వేరే బస్సులో తరలించారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement