వృద్ధురాలి ఆత్మహత్య | old woman suicides | Sakshi
Sakshi News home page

వృద్ధురాలి ఆత్మహత్య

May 30 2017 11:39 PM | Updated on Sep 5 2017 12:22 PM

మండలంలోని ఎం.కొత్తపల్లి గ్రామంలో మంగళవారం ఓ వృద్ధురాలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. కేశమ్మ(75) అనే వృద్ధురాలు గత కొంత కాలంగా మోకాళ్ల నొప్పి, అనారోగ్యంతో బాధపడుతుండేది.

గార్లదిన్నె : మండలంలోని ఎం.కొత్తపల్లి గ్రామంలో మంగళవారం ఓ వృద్ధురాలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. కేశమ్మ(75) అనే వృద్ధురాలు గత కొంత కాలంగా మోకాళ్ల నొప్పి, అనారోగ్యంతో  బాధపడుతుండేది. పలు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్నా నయం కాకపోవడంతో కుటుంబసభ్యులతో రోజూ మధనపడుతుండేది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు భర్త చెన్నారెడ్డి,  కుమారుడు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రదీప్‌కుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement