రామగుండం ఎన్టీపీసీ కాంట్రాక్టు ఉద్యోగులు బుధవారం ఉదయం కర్మాగారం లేబర్ గేట్ వద్ద ఆందోళనకు దిగారు.
రామగుండం ఎన్టీపీసీ కాంట్రాక్టు ఉద్యోగులు బుధవారం ఉదయం కర్మాగారం లేబర్ గేట్ వద్ద ఆందోళనకు దిగారు. ఇటీవల వివిధ కారణాలతో తొలగించిన 11 మందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. కాంట్రాక్టు కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనలో 500 మంది ఉద్యోగులు పాల్గొన్నారు.