ఇక అన్ని మీసేవ కేంద్రాల్లో ఆధార్‌ నమోదు | now aadhar enrollement at all meesevas | Sakshi
Sakshi News home page

ఇక అన్ని మీసేవ కేంద్రాల్లో ఆధార్‌ నమోదు

Aug 20 2016 1:21 PM | Updated on Oct 16 2018 3:38 PM

ఇప్పటి వరకు కేవలం 72 మీసేవ కేంద్రాల్లో మాత్రమే ఆధార్‌ నమోదు కార్యక్రమం జరుగుతోంది.

కర్నూలు(అగ్రికల్చర్‌):   ఇప్పటి వరకు కేవలం 72 మీసేవ కేంద్రాల్లో మాత్రమే ఆధార్‌ నమోదు కార్యక్రమం జరుగుతోంది. అన్ని ప్రాంతాల్లో ఆధార్‌ నమోదు లేకపోవడం తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్‌ నమోదును మరింత అందుబాటులోకి తీసుకురావాలని జిల్లాలో ఉన్న అన్ని మీసేవ కేంద్రాల్లో ఆధార్‌ నమోదు కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ మేరకు మీసేవ కేంద్రాల డైరక్టర్‌ నుంచి ఆదేశాలు వచ్చాయని జిల్లా మీసేవ కేంద్రాల పరిపాలనాధికారి వెంకటలక్ష్మి తెలిపారు. జిల్లాలో  మొత్తం 395 మీసేవ కేంద్రాలు ఉన్నాయి.ఇందులో 72 కేంద్రాల్లో ఆధార్‌ నమోదు సదుపాయం ఉండగా మిగిలిన వాటికి ఈ నెల 22లోగా  ఆధార్‌ కిట్లు సరఫరా చేస్తారు. ఈ మేరకు ఏపీ ఆన్‌లైన్, కార్వే, సీఎంఎస్‌లను ఆదేశించినట్లు  మీసేవ కేంద్రాల పరిపాలనాధికారి వెంకటలక్ష్మి తెలిపారు.   కొత్తగా ఏర్పాటు చేసే మీసేవ కేంద్రాలోనూ ఆధార్‌ నమోదు ఉంటుందని ఆమె విలేకర్లకు వెల్లడించారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement