విశాఖ టు ఢిల్లీ, ముంబైకి కొత్త విమానాలు | new flights from vishaka to mumbai, dehli | Sakshi
Sakshi News home page

విశాఖ టు ఢిల్లీ, ముంబైకి కొత్త విమానాలు

Nov 15 2015 10:20 PM | Updated on Sep 3 2017 12:32 PM

విశాఖ విమానాశ్రయం నుంచి ఢిల్లీ, ముంబైకి జెట్ ఎయిర్‌వేస్ సంస్థ నూతన సర్వీసులను ప్రకటించింది.

గోపాలపట్నం: విశాఖ విమానాశ్రయం నుంచి ఢిల్లీ, ముంబైకి జెట్ ఎయిర్‌వేస్ సంస్థ నూతన సర్వీసులను ప్రకటించింది. విశాఖ-ఢిల్లీ విమాన సర్వీసును ఆదివారం కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు, ఎంపీ కంభంపాటి హరిబాబు ప్రారంభించారు. ఈ విమానం ప్రతిరోజూ ఉదయం 9.10 గంటలకు విశాఖ నుంచి బయల్దేరి 11.30 గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది. ఢిల్లీలో సాయంత్రం 6.40 గంటలకు బయల్దేరి రాత్రి 8.55 గంటలకు విశాఖ చేరుకుంటుంది.

ఇక, విశాఖ-ముంబై విమాన సర్వీసు ముంబై నుంచి ఉదయం 6.25గంటలకు బయల్దేరి 8.25 గంటలకు విశాఖ చేరుకుంటుంది. విశాఖ నుంచి రాత్రి 9.25 గంటలకు ప్రయాణమై.. 11.25 గంటలకు ముంబై చేరుకుంటుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement