పుట్టింటికి పంపలేదన్న చిన్న కారణంతో నవ వధువు ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం ఉదయం కూడేరులో చోటు చేసుకుంది.
పుట్టింటికి పంపలేదని మనస్థాపానికి గురై ఉదయాన్నే ఇంటి ముందు ఉన్న బాత్రూమ్లోకి వెళ్ళి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుంది. మంటలకు తాళలేక కేకలు వేసుకుంటూ బయటకు వచ్చేసింది. కుటుంబ సభ్యులు దగ్గరకు వెళ్లి మంటలు ఆర్పిన కొద్దిసేపటికే మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఉమాదేవి తల్లిదండ్రులు, బంధువులు సంఘటన స్థలానికి వచ్చి బోరున విలపించారు. పెళ్ళైన మూడు నెలలకే తనువు చాలించావా అంటూ రోదించారు. తలనొప్పిని భరించలేక, ఊరికి పంపలేదన్న చిన్న కారణంతోనే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ రాజు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు.