ప్రకాశం బ్యారేజీ పటిష్టతకు కృషి | Minister Uma visits Prakasam barrage | Sakshi
Sakshi News home page

ప్రకాశం బ్యారేజీ పటిష్టతకు కృషి

Dec 24 2016 9:52 PM | Updated on Sep 4 2017 11:31 PM

ప్రకాశం బ్యారేజీ పటిష్టతకు కృషి

ప్రకాశం బ్యారేజీ పటిష్టతకు కృషి

ప్రకాశం బ్యారేజ్‌ రెండోసారి నిర్మాణం జరిగి 60 ఏళ్ళైందని, దీన్ని మరో వందేళ్లు పటిష్టంగా ఉండే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర జల వనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు.

విజయవాడ  ప్రకాశం బ్యారేజ్‌ రెండోసారి నిర్మాణం జరిగి 60 ఏళ్ళైందని,  దీన్ని మరో వందేళ్లు పటిష్టంగా ఉండే  విధంగా తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర జల వనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. 60 వసంతాలు పూర్తియిన నేపథ్యంలో శనివారం  మంత్రి బ్యారేజ్‌ వద్ద ఉన్న స్వర్గీయ టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న బ్యారేజ్‌ పటిష్టపర్చటానికి పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తిచేసి అమరావతికి తలమానికంగా తీర్చిదిద్దుతామన్నారు. 60 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా బ్యారేజ్‌ సమీపంలో రైతులతో పండుగ మాదిరి ఉత్సవాన్ని నిర్వహించటానికి సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. కార్యక్రమంలో మంత్రితోపాటు ఇరిగేషన్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement