'ప్రాజెక్టులను అడ్డుకుంటే తరిమికొడతాం' | Minister Harish Rao attends constituency trs meeting in Aleru | Sakshi
Sakshi News home page

'ప్రాజెక్టులను అడ్డుకుంటే తరిమికొడతాం'

Jun 24 2016 3:48 PM | Updated on Sep 4 2017 3:18 AM

తెలంగాణ అభివృద్ధి కోసం నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులను అడ్డుకోవాలనుకుంటే ప్రతిపక్షాలను తరిమికొడతామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు.

ఆలేరు (నల్లగొండ) : తెలంగాణ అభివృద్ధి కోసం నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులను అడ్డుకోవాలనుకుంటే ప్రతిపక్షాలను తరిమికొడతామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. శుక్రవారం ఆయన నల్లగొండ జిల్లా ఆలేరులో జరిగిన నియోజకవర్గ టీఆర్‌ఎస్ సమావేశంలో మాట్లాడారు. అంతకుమునుపు ఆయన స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకారం కార్యక్రమంలో పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్‌గా సుమలత ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement