కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య | man suicide with family problems | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

Published Sun, Dec 11 2016 9:38 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

పాములపాడు: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన షేక్‌ జిలానీ(35), మిట్టకందాల గ్రామానికి చెందిన జరినాబీతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. జిలానీ కార్పెంటర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కాగా కొన్నాళ్లుగా మద్యానికి బానిసై భార్యను నిత్యం వేధించేవాడు. భర్తను మద్యం మానేయమని పలుమార్లు కోరినా మానక పోవడంతో విసిగి పోయిన జరినాబీ పుట్టినింటికి చేరింది. నెల రోజుల తర్వాత జిలానీ మిట్టకందాలకు వెళ్లి భార్యతో కలసి అక్కడే కాపురం పెట్టాడు. కొద్ది రోజుల తర్వాత అతను మళ్లీ మద్యం సేవించడంతో భార్య గొడవపడింది. ఈ క్రమంలోనే మళ్లీ వెంకటాపురం వెళ్లాలని జిలానీ పట్టుబడ్టడంతో ఇందుకు భార్య ఒప్పుకోలేదు. దీంతో మనస్తాపం చెందిన అతను ఈనెల 7వ తేదీన శరీరంపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్ర గాయాలు కావడంతో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మరణ వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సు«ధాకరరెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement