ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కళ్యాణ్నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
చింతపల్లి
ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కళ్యాణ్నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరంగా యాత్ర విజయవంతానికి బీజేపీ శ్రేణులు కృషి చేయాలన్నారు. ప్రధాని నరేంద్రమోదీతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుడు కుకుడపు రామకృష్ణ, శ్రీనివాస్రెడ్డి, శంకర్, నగేష్, పర్వతాలు, సైదులు, విక్రమ్, ధన్రాజ్ ఉన్నారు.