ఖమ్మం 66.. కొత్తగూడెం 80 | khammam 66.. kothagudem 80 | Sakshi
Sakshi News home page

ఖమ్మం 66.. కొత్తగూడెం 80

Sep 7 2016 12:07 AM | Updated on Sep 4 2017 12:26 PM

ఖమ్మం 66.. కొత్తగూడెం 80

ఖమ్మం 66.. కొత్తగూడెం 80

పునర్విభజనతో జిల్లా ఎక్సైజ్‌ శాఖ కూడా రెండు ముక్కలు కానుంది. ప్రస్తుతం ఖమ్మం ఎక్సైజ్‌ యూనిట్‌ పరిధిలో 78, కొత్తగూడెం యూనిట్‌ పరిధిలో 71 మద్యం దుకాణాలు ఉన్నాయి. నూతన జిల్లా ఏర్పడనుండటంతో ఖమ్మం యూనిట్‌ పరిధిలో 66, కొత్తగూడెం యూనిట్‌ పరిధిలోకి 80 మద్యం దుకాణాలు రానున్నాయి.

  •  రెండుగా చీలనున్న ఖమ్మం జిల్లా ఎక్సైజ్‌శాఖ
  •  నూతన జిల్లా పరిధిలోకి 71 మద్యం దుకాణాలు
  • మహబూబాబాద్‌లోకి బయ్యారం, గార్ల షాపులు
  • కొత్తగూడెంలో మరో మద్యం డిపో

  • ఖమ్మం క్రైం:
         పునర్విభజనతో జిల్లా ఎక్సైజ్‌ శాఖ కూడా రెండు ముక్కలు కానుంది. ప్రస్తుతం ఖమ్మం ఎక్సైజ్‌ యూనిట్‌ పరిధిలో 78, కొత్తగూడెం యూనిట్‌ పరిధిలో 71 మద్యం దుకాణాలు ఉన్నాయి. నూతన జిల్లా ఏర్పడనుండటంతో ఖమ్మం యూనిట్‌ పరిధిలో 66, కొత్తగూడెం యూనిట్‌ పరిధిలోకి 80 మద్యం దుకాణాలు రానున్నాయి.
    నూతనంగా ఏర్పడే కొత్తగూడెం జిల్లాలోకి ఇల్లెందు చేరనుండటంతో ఇప్పటి వరకు ఖమ్మం ఎక్సైజ్‌ యూనిట్‌ పరిధిలోని ఇల్లెందు ఎక్సైజ్‌ సర్కిల్‌ పరిధిలో ఉన్న పది మద్యం దుకాణాలు, రెండు బార్లు కూడా కొత్తగూడెం జిల్లా పరిధిలోకి వెళ్లనున్నాయి. ఇప్పటి వరకు కొత్తగూడెం యూనిట్‌ పరిధిలో ఉన్న జూలూరుపాడు, ఏన్కూరులోని మద్యం దుకాణాలు ఖమ్మం యూనిట్‌లోకి రానున్నాయి.
    గార్ల, బయ్యారం దుకాణాలు మహబూబాబాద్‌లోకి..
    ఇప్పటి వరకు ఖమ్మం ఎక్సైజ్‌ యూనిట్‌ పరిధిలో ఉన్న బయ్యారం, గార్ల మండలాల దుకాణాలు నూతన జిల్లా మహబూబాబాద్‌లోకి వెళ్లనున్నాయి. దీనివల్ల ఖమ్మం యూనిట్‌ పరిధిలో రెండు దుకాణాల సంఖ్య తగ్గనుంది.
    కొత్తగూడెంలో మరో మద్యం డిపో
    వైరాలో ఉన్న మద్యం డిపో నుంచే ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా మద్యం సరఫరా అవుతుంది. నూతనంగా కొత్తగూడెం జిల్లా ఏర్పడనుండటంతో అక్కడ మరో డిపోను ఏర్పాటు చేయనున్నారు. దీని కోసం ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు ఐదు ఎకరాల స్థలాన్ని సైతం ఎంపిక చేశారు. మద్యం డిపోతోపాటు ఆ స్థలంలో ఎక్సైజ్‌ నూతన భవనాలు కూడా ఏర్పాటు చేయనున్నారు.
    ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌లే బాసులు
    ఇక నుంచి ప్రతి జిల్లాకు ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌లే జిల్లా బాసులుగా వ్యవహరించనున్నారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు రీజనల్‌ అధికారులుగా ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ వ్యవహరిస్తారు. వీరి కార్యాలయాలు మాత్రం ఖమ్మంలోనే ఉండనున్నాయి.
    మూడు చెక్‌పోస్ట్‌లు కొత్తగూడెం.. రెండు చెక్‌ పోస్ట్‌లు ఖమ్మం
    ఇప్పటి వరకు ఎక్సైజ్‌ చెక్‌పోస్టులు ఐదు ఉండగా నూతనంగా ఏర్పడే కొత్తగూడెం జిల్లాలోకి భద్రాచలం, అశ్వారావుపేట, కొత్తగూడెం, ఖమ్మం జిల్లా పరిధిలోకి బోనకల్, ముత్తగూడెం రానున్నాయి. ప్రస్తుత్తం జిల్లాలో 44 బార్లు ఉండగా ఖమ్మం యూనిట్‌ పరిధిలో 32, కొత్తగూడెం యూనిట్‌ పరిధిలో 12 ఉన్నాయి. నూతనంగా ఏర్పడే జిల్లాలోకి ఇల్లెందు వెళ్లనుండటంతో అక్కడి రెండు బార్లు కొత్తగూడెం యూనిట్‌ పరిధిలో చేరుతాయి.
    తగ్గని ఖమ్మం ఎక్సైజ్‌ ఆదాయం
    పది మద్యం దుకాణాలు, రెండు బార్లు కొత్తగూడెం జిల్లాలోకి వెళ్తున్నా ఖమ్మం జిల్లా ఎక్సైజ్‌ పరిధిలో ఎటువంటి ఆదాయం తగ్గదని ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నారు. కొత్తగూడెం యూనిట్‌ పరిధిలో పారిశ్రామిక ప్రాంతం ఉన్నా ఇప్పటి వరకు ఖమ్మం ఎక్సైజ్‌ యూనిట్‌ పరిధిలోకి వచ్చే ఆదాయం కంటే తక్కువగానే ఉంటుందని విశ్లేషించారు.

    సిబ్బంది కూడా మారాల్సిన పనిలేదు
    మహేశ్‌బాబు, ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌

    నూతన జిల్లా ఏర్పడ్డా ఎక్సైజ్‌శాఖలో సిబ్బంది మారాల్సిన అవసరం లేదు. జిల్లాలో ప్రస్తుతం సుమారు 300 మంది ఎక్సైజ్‌ సిబ్బంది ఉన్నారు. నూతన జిల్లా ఏర్పడిన తర్వాత కూడా ఖమ్మం యూనిట్‌ పరిధిలో ఉండే సిబ్బందే విధులు నిర్వహిస్తారు. కొత్తగూడెం యూనిట్‌ పరిధిలో విధులు నిర్వహించే సిబ్బంది ఆ జిల్లాలోనే పనిచేస్తారు. దీనికి సంబంధించిన ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది. నూతన జిల్లా ఏర్పాటు తర్వాత గానీ పూర్తిస్థాయిలో స్పష్టత రాదు.
     

Advertisement

పోల్

Advertisement