ప్రతి జిల్లాలో ఇంక్యూబేషన్ సెంటర్లు
ఏలూరు (మెట్రో) : రాష్ట్రంలో యువత బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ప్రతి జిల్లాలో విజ్ఞానాన్ని పెంచే ఇంక్యుబేషన్ సెంటర్లను నెలకొల్పనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు.
ఏలూరు (మెట్రో) : రాష్ట్రంలో యువత బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ప్రతి జిల్లాలో విజ్ఞానాన్ని పెంచే ఇంక్యుబేషన్ సెంటర్లను నెలకొల్పనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. విజయవాడ నుండి గురువారం జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖా మండల స్ధాయి అధికారుల వరకూ నిర్వహించిన సెల్ కాన్ఫరెన్స్లో విద్యాశాఖా ప్రగతి తీరుపై సమీక్షించారు. కలెక్టరేట్లో కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఈ సెల్కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. నాణ్యమైన విద్యనందించి నూతన ఆలోచనా విధానాలు, కొత్త విషయాలను తెలుసుకుని వాటిని పది మందికి తెలియచేసి విజా›్ఞనాన్ని మరింత పెంపొందించాల్సిన అవసరం ఎంతో ఉన్నదని ఆ దిశగా అధికారులు ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాని కలెక్టర్లను కోరారు. ప్రాధమిక విద్యా స్ధాయి నుండి యూనివర్శిటీ స్ధాయివరకూ ప్రతి ఒక్కరూ విద్యా రంగంలో కొత్త విధానాలను తీసుకురావాలని ప్రతి జిల్లానూ ఒక విజ్ఞాన కేంద్రంగా అభివృద్ది చేయడానికి ఇంక్యూబేషన్ సెంటరు ఎంతో దోహదపడుతుందన్నారు.
ఇంజనీరింగ్ విద్యార్థులను వారానికోరోజు పల్లె ప్రాంతాలకు తీసుకువెళ్ళి అక్కడ చెట్టులు నాటడం వాటి సంరక్షణా చర్యలు చేపట్టం నీటి నిల్వ వల్ల కలిగే లాభాలను పరిశుభ్ర కార్యక్రమాల వలన ఆరోగ్యం ఏ విధంగా పెంపొందుతుందో ప్రజలకు వివరించడం వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు.కలెక్టర్ కాటంనేని భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రాధమిక విద్యా స్ధాయి నుండే వృత్తి విద్యాకోర్సుల్లో అవగాహన పెంచే విద్యను అమలు చేస్తున్నామని 10వ తరగతి తరువాత ఏ ఉపాధి పొందాలో ఏ విద్య నేర్చుకోవాలో అవగాహన కలిగించాలని ప్రత్యేక కెరీర్ కౌన్సిలింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు జేసీ ఎంహెచ్.షరీఫ్, డీఈఓ డీ.మధుసూదనరావు, సర్వశిక్షాభియాన్పీఓ వీ.బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు.