డయాబెటిస్పై ప్రజలకు అవగాహన పెంచాలి
డయాబెటిస్ వ్యాధి రాకుండా ప్రజల్లో అవగాహన పెంచాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు.
–ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్
కర్నూలు(హాస్పిటల్):డయాబెటిస్ వ్యాధి రాకుండా ప్రజల్లో అవగాహన పెంచాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ఎండోక్రైనాలజి విభాగం ఆధ్వర్యంలో వరల్డ్ డయాబెటిస్ డేను పురస్కరించుకుని సోమవారం కర్నూలు మెడికల్ కాలేజీ నుంచి మార్నింగ్ వాక్ను మంత్రి కామినేని ప్రారంభించారు. కళాశాల నుంచి రాజవిహార్, కిడ్స్వరల్డ్, పాత కంట్రోల్రూమ్ మీదుగా కొండారెడ్డి బురుజు వరకు మార్నింగ్ వాక్ సాగింది. ఈ సందర్భంగా మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ చాలా మందికి షుగర్ వ్యాధి ఉన్నట్లు తెలియదన్నారు. పరీక్షలు చేయించుకుని తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరించాలని వైద్యులకు సూచించారు. సరైన రీతిలో వ్యాయామం చేస్తే ఈ వ్యాధిని కొంత వరకు నియంత్రించవచ్చని తెలిపారు. చక్కెర వ్యాధి రాకుండా ముందుజాగ్రత్తల్లో భాగంగా రాష్ట్ర మహిళా చెకప్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో రాజ్యసభ్య సభ్యులు టీజీ వెంకటేష్, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి, జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీఎస్ రామ్ప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి, కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్రనాథ్రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ ప్రభాకరరెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ పి. చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
హెల్త్క్లబ్లో మంత్రి కామినేని శ్రీనివాస్
కర్నూలు హార్ట్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న హెల్త్క్లబ్ను మంత్రి కామినేని శ్రీనివాస్ సోమవారం ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా క్లబ్లో ఏర్పాటు చేసిన జిమ్లోని పరికరాలను పరిశీలించారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి, కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ జీఎస్ రామ్ప్రసాద్తో కలిసి బ్యాడ్మింటన్ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇలాంటి హెల్త్క్లబ్ ఎక్కడా లేదని, ఇలాంటి క్లబ్లను రాష్ట్రంలో అన్ని చోట్లా ఏర్పాటు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడుకు సూచిస్తానన్నారు.