సేవల్లో ఆలస్యాన్ని సహించను
ఏలూరు (ఆర్ఆర్ పేట) : జిల్లాలోని ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు మీ కోసం, మీ సేవ కార్యక్రమాల్లో ప్రజలకు సర్వీస్ చేసే విషయాల్లో ఒక్క రోజు ఆలస్యం చేసినా సహించేది లేదని కలెక్టర్ కాటంనేని భాస్కర్ స్పష్టం చేశారు.
ఏలూరు (ఆర్ఆర్ పేట) : జిల్లాలోని ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు మీ కోసం, మీ సేవ కార్యక్రమాల్లో ప్రజలకు సర్వీస్ చేసే విషయాల్లో ఒక్క రోజు ఆలస్యం చేసినా సహించేది లేదని కలెక్టర్ కాటంనేని భాస్కర్ స్పష్టం చేశారు. కలెక్టరేట్లో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఆర్డీవోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ మీ కోసం కార్యక్రమంలో వచ్చే ప్రజాఫిర్యాదులు పరిష్కరించడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని, ఏ ఒక్క ఫిర్యాదు ఆలస్యం చేయకుండా పరిష్కరించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో నూటికి 80 నుంచి 90 శాతం వరకు బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరిగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 999 పంచాయతీల్లో కంప్యూటర్స్ ఏర్పాటు చేయడం జరిగిందని ఈ–ఆఫీస్ ద్వారా పంచాయతీ కార్యాలయాల్లో ఫైల్స్ను సంబంధిత కార్యాలయాలకు పంపించి త్వరితగతిన నివేదికలు పొందాలని కలెక్టర్ అధికారులకు చెప్పారు. కార్యక్రమంలో జేసీ పి.కోటేశ్వరరావు, డీపీవో కె.సుధాకర్, జెడ్పీ సీఈవో సత్యనారాయణ, డీఎస్వో డి.శివశంకర్రెడ్డి, డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసులు పాల్గొన్నారు.
అక్రమ నిర్మాణాల బాధ్యులపై చర్యలు
జిల్లాలో పంచాయతీల్లో జరిగే అక్రమ లేవుట్లు, అక్రమ భవన నిర్మాణాలపై దృష్టి కేంద్రీకరించి అందుకు బాధ్యులపై చర్యలు తీసుకోనున్నట్టు కలెక్టరు భాస్కర్ చెప్పారు. శుక్రవారం పంచాయతీ పన్నులు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, బయోమెట్రిక్ అటెండెన్స్, ఎల్ఈడీ బల్బులు, తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీల్లో అధికారుల నిర్లక్ష్యం, అవకతవకల వల్ల అక్రమ లేఅవుట్లు, అక్రమ భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయని, త్వరలో పంచాయతీల్లో ఎక్కడెక్కడ అక్రమ లేఅవుట్లు, బిల్డింగులు నిర్మాణాలు జరుగుతున్నదీ తెలుసుకునేందుకు ఒక సాఫ్ట్వేర్ను రూపొందించనున్నట్టు చెప్పారు. పంచాయతీ కార్యాలయంలోనే నివాసం ఉంటున్న తిరుపతిపురం గ్రామ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీపీవోను ఆదేశించారు.