శ్రీవారి ఆలయంలో హుండీ ఆదాయం లెక్కింపు | hundi counting in srivari temple | Sakshi
Sakshi News home page

శ్రీవారి ఆలయంలో హుండీ ఆదాయం లెక్కింపు

Jan 18 2017 12:10 AM | Updated on Jul 29 2019 6:07 PM

శ్రీవారి ఆలయంలో హుండీ ఆదాయం లెక్కింపు - Sakshi

శ్రీవారి ఆలయంలో హుండీ ఆదాయం లెక్కింపు

దేవరపల్లి : ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో మంగళవారం హుండీ లెక్కింపు నిర్వహించారు.

దేవరపల్లి : ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో మంగళవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. 18 రోజులకు గాను వచ్చిన ఆదాయాన్ని లెక్కించగా రూ.1,03,06,383 లభించినట్టు ఆలయ కార్యనిర్వాహణా««ధికారి వేండ్ర త్రినాథరావు తెలిపారు. 239 గ్రాముల బంగారం, 3 కేజీల 152 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీలు లభించినట్టు చెప్పారు. 
రూ1,15,116 విరాళం అందజేత 
చిన వెంకన్న ఆలయానికి మంగళవారం కామవరపుకోటకు చెందిన దాత గంటా బులిస్వామి కుటుంబ సభ్యులు   1,15,116 రూపాయలను అన్నదాన విరాళంగా అందజేశారు. విరాళాన్ని దాతలు ఈవో వేండ్ర త్రినాథరావుకు అందించారు. 
 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement