కబడ్డీ విజేత గుంతకల్లు జట్టు | guntakal team won in kabaddi tourny | Sakshi
Sakshi News home page

కబడ్డీ విజేత గుంతకల్లు జట్టు

Oct 12 2016 11:32 PM | Updated on Sep 4 2017 5:00 PM

కబడ్డీ  విజేత గుంతకల్లు జట్టు

కబడ్డీ విజేత గుంతకల్లు జట్టు

పట్టణంలో నిర్వహించిన రంగనాథ జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో గుంతకల్లు జట్టు విజేతగా నిలిచింది.

యాడికి : పట్టణంలో నిర్వహించిన రంగనాథ జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో  గుంతకల్లు జట్టు  విజేతగా నిలిచింది. రెండు రోజులుగా యాడికిలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో 40 జట్లు పాల్గొన్నాయి. గుంతకల్లు, యాడికి జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. బుధవారం హోరాహోరీగా జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో గుంతకల్లు జట్టు విజేతగా నిలిచింది. ద్వితీయ, తతీయ స్థానంలో యాడికి జట్లు నిలిచాయి. విజేతలకు   నగదు బహుమతులతో పాటు మెమొంటోలు అందజేశారు.

బహుమతుల ప్రదానోత్సవంలో సౌత్‌ ఇండియన్‌ కేవీఐసీ చైర్మన్‌ చంద్రమౌళి, యాడికి ఎంపీపీ వేలూరు రంగయ్య, మాజీ ఉప సర్పంచ్‌ బాలా రమేశ్‌బాబు, జేవీవీ జిల్లా కార్యదర్శి అబ్దుల్‌ రజాక్, పీడీ మురళి, పీఈటీ  సాల్మన్‌ సుప్రీం, నిర్వాహకులు బాబు, విశ్వనాథ్, కుమార్,సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement