ప్రమాదంలో మృతి చెందిన ఖెత్రోబెహరా
చేపల వేటకోసమని వెళ్లి విద్యుత్ షాక్కు గురై మత్స్యకారుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం ఇక్కడ చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...మాణిక్యపురం గ్రామానికి చెందిన ఖెత్రోబెహరా(47) తన గ్రామం నుంచి బల్లిపుట్టుగ పొలాల మార్గం గుండా కుసుంపురం తంపరబీలలో చేపల వేటకు వెళ్తుండగా నేలకొరిగిన విద్యుత్ స్తంభం వైర్లు తగిలి మృతి చెందాడు. వేకువ జామున వెళ్లడంతో వైర్లు కనిపించక ప్రమాదానికి గురయ్యాడు.


