ఇద్దరు రైతుల ఆత్మహత్య | farmers sucside | Sakshi
Sakshi News home page

ఇద్దరు రైతుల ఆత్మహత్య

Sep 17 2016 12:13 AM | Updated on Oct 1 2018 2:44 PM

కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలంలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. భూపాలపట్నంకు చెందిన మునిగాల అంజయ్య (48) అప్పులబాధతో గ్రామశివారులోని పశువుల కొట్టం వద్ద ఉరివేసుకొని బలవన్మరణం చెందాడు.

 చొప్పదండి: కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలంలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. భూపాలపట్నంకు చెందిన మునిగాల అంజయ్య (48) అప్పులబాధతో గ్రామశివారులోని పశువుల కొట్టం వద్ద ఉరివేసుకొని బలవన్మరణం చెందాడు. స్థానిక రైతులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. గ్రామంలో 4.38 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా గత కొన్నేళ్లుగా వ్యవసాయంలో నష్టాలు రావడంతో రూ.5లక్షలకు పైగా అప్పులయ్యాయి. వాటిని తీర్చే మార్గం లేక మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మరో సంఘటనలో వెదురుగట్టకు చెందిన పంబాల లచ్చయ్య(45) ఈనెల 8న పొలం వద్ద క్రిమిసంహారక మందు తాగాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. లచ్చయ్యకు గ్రామంలో నాలుగు ఎకరాల భూమి ఉంది. రూ.పది లక్షలకు పైగా అప్పులున్నాయి. అప్పులు తీర్చే మార్గం కనిపించక మనస్థాపంతో ఈనెల 8న చేను వద్ద క్రిమిసంహారక మందు తాగాడు.  

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement