సిద్దిపేట జిల్లా మిర్దొడ్డిలో విషాదం | family suicide attempt with problems | Sakshi
Sakshi News home page

సిద్దిపేట జిల్లా మిర్దొడ్డిలో విషాదం

Nov 16 2016 7:58 AM | Updated on Sep 18 2018 7:34 PM

సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం ధర్మారంలో విషాదం చోటుచేసుకుంది.

మిర్దొడ్డి(సిద్ధిపేట): సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలంలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక ఓ కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ ఘటనలో కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన ఓ కుటుంబం మంగళవారం రాత్రి విషాహారం తిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గుర్తించిన చుట్టుపక్కల వారు ఆస్పత్రికి తరలించగా.. తండ్రీ కొడుకులు మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement