
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 3 గంటల సమయం పడుతుంటే, కాలినడకన వచ్చే భక్తులకు మాత్రం 2 గంటల సమయం పడుతోంది. నిన్న (బుధవారం) 70,505 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్టు టీటీడీ పేర్కొంది.